Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 27 – 01 – 2025

BIKKIS NEWS (జనవరి 27) : TODAY NEWS IN TELUGU on 27th JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 27th JANUARY 2025

TELANGANA NEWS

రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

రైతు భరోసా నిధులు మార్చి31 లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటన.

వర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఇంటింటికి సన్నబియ్యం త్వరలో పంపిణీ చేస్తాం : మంత్రి పొంగులేటి.

రాజ్‌భవన్ లో ఘనంగా ఎట్ హోమ్ కార్యక్రమం.

పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం.

ANDHRA PRADESH NEWS

అనవసర విభేదాలు, వివాదాల జోలికి వెళ్ళవద్దు – పవన్ కళ్యాణ్

స్వర్ణాంద్ర 2047 కు కలిసి పని చేద్దాం -బాబు

ఏపిలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు.

NATIONAL NEWS

దేశ, విదేశాల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌) ను ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని మోదీ సర్కారు ప్రకటించింది.

పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలొద్దు. దొరికితే 2 సంవత్సరాలు డిబార్ – CBSE

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక. గూగుల్‌ క్రోమ్‌లో రెండు తీవ్రస్థాయి లోపాలు ఉన్నాయని ప్రకటన.

500 మంది ధనవంతులకు.. పది లక్షల కోట్ల రుణాలను బీజేపీ మాపీ చేసింది: అరవింద్‌ కేజ్రీవాల్‌

నేటి నుంచి ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు.

INTERNATIONAL NEWS

అక్రమ వలసదారులపై అమెరికాలో నిశితంగా తనిఖీలు. అక్కడి భారతీయుల్లో పెరిగిన దేశ బహిష్కరణ భయం

ఎటువంటి ఒత్తిడి లేకుండా సముద్రం అడుగున ఓ క్యాప్సూల్‌లో 120 రోజులు గడిపి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించాడు జర్మనీ ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ రుడిగర్‌ కోచ్‌.

BUSINESS NEWS

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది శనివారమైనప్పటికీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ జరుగనున్నది.

బీఎస్‌-2 సహా పాత కాలుష్య నియంత్రణ ప్రమాణాలతో తయారైన వెహికల్‌ స్క్రాపింగ్‌ చేస్తే మోటార్‌ వెహికల్‌ టాక్స్‌ సగం మాఫీ.

SPORTS NEWS

ఆస్ట్రేలియా ఓపెన్‌ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఇటలీ ఆటగాడు జన్నిక్ సిన్నర్‌. ఫైనల్ లో జ్వెరెవ్ పై గెలుపు.

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌కు నాలుగో విజయం. బంగ్లాదేశ్‌పై సునాయాస గెలుపు

EDUCATION & JOBS UPDATES

నీట్ యూజీ పరీక్షలలో ఆప్షనల్ ప్రశ్నలు ఎత్తివేత

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ గడువు ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు.

ఇంటర్మీడియట్ ఫస్టియర్‌ ఇంగ్లిష్‌లో ప్రశ్నల సంఖ్య 16 ఉండగా, తాజాగా 17కు పెంచారు. ఈ అదనపు ప్రశ్నను సెక్షన్‌-సీలో ఇస్తారు.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు